Wife Daughter Carried Husband : ఓ ఇల్లాలు అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను బిడ్డతో కలిసి చేతులపై కలెక్టరేట్కు మోసుకొచ్చింది. ప్రభుత్వం తన భర్తకు పింఛన్ ఇవ్వాలంటూ అధికారులను వేడుకుంది. కరీంనగర్లోని ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన వెంకటేశం జీవనోపాధికై 20 సంవత్సరాల క్రితం జిల్లా కేంద్రానికి వచ్చాడు. వెంకటేశంకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఆటో నడుపుతూ, దర్జీ పని చేస్తూ ఇద్దరు కుమార్తెల వివాహం చేశాడు. మరో కూతురుకు వివాహం చేయాల్సి ఉంది. అకస్మాత్తుగా వెంకటేశం అనారోగ్యంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భార్యా ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ వెంకటేశంను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. వైద్యం కోసం డబ్బులు సరిపోవడం లేదని తన భర్తకు పింఛను ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు దరఖాస్తు అందజేసింది. వరంగల్ మెడికల్ కాలేజీ, గాంధీ ఆసుపత్రికి వెళితే మందులు ఉచితంగానే వస్తాయి. కానీ మా ఆయన నడవలేని పరిస్థితి వల్ల మందులకు రూ.10,000 ఖర్చు అవుతున్నాయి. నేను ఆసుపత్రిలో ఆయమ్మగా చేస్తాను. వచ్చే జీతమంతా మందులకే అవుతున్నాయి. మా కుమార్తె సిస్టర్గా పని చేస్తుంది. వచ్చే జీతంపైనే బతుకుతున్నాం. నా భర్తకు పింఛన్ కావాలి - వెంకటేశం భార్య
Comments