KIMS doctors bone cancer awareness : బోన్ క్యాన్సర్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ కిమ్స్, సన్ షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వైద్యులు వాకథాన్ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్డు సంజీవయ్య పార్కు నుంచి పీవీ ఘాట్ వరకు వాకథాన్ చేపట్టి, బోన్ క్యాన్సర్ ప్రభావం, చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. బోన్ క్యాన్సర్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురువారెడ్డి తెలిపారు. ప్రస్తుతం కీమో, రోడియో, సర్జికల్ థెరపీలతో సులభంగా క్యాన్సర్ను నయం చేయవచ్చన్నారు. గతంలో బోన్ క్యాన్సర్ వచ్చిన భాగాన్ని తొలగించే వారని, ఇప్పుడు ఆ అవసరం లేదని డాక్టర్ వివరించారు. ఏదైనా గాయం అయినప్పుడు అది నెల రోజులైనా తగ్గకపోతే వెంటనే అర్థో వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ బోన్ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, దీంతో మొదటి దశలోనే గుర్తించి, నయం చేయవచ్చని డాక్టర్ తెలిపారు. పేదలకు ఉచిత అంబులెన్స్, ఆటోలను ప్రదానం చేసిన నటుడు సోనూసూద్సెకన్లలో వరల్డ్ మ్యాప్ గీసిన బుడ్డోడు - ప్రపంచ రికార్డుల్లో చోటు
Comments