Snake At Ketaki Sangameswara Temple : సంగారెడ్డి జిల్లా ఝరాసంఘంలోని కేతకీ సంగమేశ్వర ఆలయంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో నాగు పాము ప్రత్యక్షమైంది. ఆలయం ప్రాంగణంలో నాగు పాము ప్రదక్షిణ చేస్తున్నట్లు తిరిగింది. వర్షపు చినుకులు పడుతున్న వేళ భక్తులు ఆలయ సత్రాల్లో నిల్చుని నాగదేవత వచ్చిందని భక్తితో తిలకించారు. పడగ విప్పుతూ భక్తులకు అభయమిచ్చేలా చూస్తూ పాము మెల్లగా ముందుకు సాగింది. పాము వద్దకు పిల్లి వచ్చింది. నాగు పామును ఆశ్చర్యంతో చూసింది. రెండూ ఒకదాని కొకటి ఎగాదిగా చూసుకున్నాయి. అయినా అవి ఎలాంటి వైరానికి పోలేదు. కాసేపు అగి పక్కకు వెళ్లిపోయాయి. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఓ భక్తుడు తన సెల్ఫోన్ కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. "నాగరాజు పడగ విప్పి దర్శనమిచ్చాడు" అంటూ నెట్టిజన్లు కామెంట్లు చేస్తూ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. పైన ఉన్న వీడియో లో మనము ఆ దృశ్యాలను చూడవచ్చు.