ACB Officials Conduct Raids at Palamaneru Irrigation Office: చిత్తూరు జిల్లాలో పలమనేరు ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలమనేరు నీటిపారుదల శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రజాక్ అనే ఉద్యోగి రూ.13000 లంచం తీసుకుంటుండగా అధికారులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే పుంగనూరు మండలం కంగానంపల్లికి చెందిన కాంట్రాక్టర్ ఈశ్వర్ అలియాస్ ఆనంద్ 2017-18 సంవత్సరంలో చేసిన నీరు-చెట్టు పనులకు 6 లక్షల రూపాయల బిల్లులు రావాల్సి ఉంది. 8 సంవత్సరాల నుంచి బిల్లులు పెట్టాలని ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. పలమనేరు ఇరిగేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న అబ్దుల్ రజాక్ బిల్లులు పెట్టాలంటే 15 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ సీతారామారావు తెలిపారు. చివరికి 13000 రూపాయలు ఇస్తానని చెప్పి, డబ్బులు ఇస్తుండగా ముందస్తుగానే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా సీనియర్ అసిస్టెంట్ రజాక్ను పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
Comments