Skip to playerSkip to main content
  • 14 minutes ago
Free Mass Weddings for 24 Couples on the Occasion of Sri Rama Navami : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలోని నీలకంఠేశ్వర ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని  సీతారాముల కళ్యాణంతో పాటు 24 పేద జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటకకు చెందిన నంజావధూత స్వామి పాల్గొని తాళిబొట్లు అందించి వివాహం జరిపించి వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం వధూవరులకు దేవాలయ ట్రస్టు తరపున వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించారు. పెళ్లి వేడుకల్లో ఓ జంట గుర్రంపై వచ్చి అందరిని అబ్బురపరిచారు. అనంతరం జరిపిన సాంస్కృతిక కార్యక్రమాల్లో రఘువీరా సతీమణి ఆమె బృందంతో సీతారాముల భజనతో నృత్యం చేశారు. శ్రీరామనవమి మరుసటి రోజు సీతారాముల కళ్యాణంతో పాటు సామూహిక వివాహాలు గత 40 సంవత్సరాలుగా జరపటం ఆనవాయితీగా మారిందని రఘువీర పేర్కొన్నారు.

Category

🗞
News
Transcript
00:23Thank you very much.
00:36Thank you very much.
Comments

Recommended