హిందూపూర్ లో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ విజయవాడలో వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం కూటమి పై మండిపడ్డారు. కక్షపూరితంగానే వైసీపీ కార్యాలయంపై దాడి చేశారని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. తక్షణమే హిందూపూర్ తెలుగుదేశం కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వంగవీటి ఆశ నిర్ణయం వెనుక, ఆ పార్టీలోకే ఎంట్రీ - అక్కడ నుంచే పోటీ..!? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/vangaveeti-rangas-daughter-asha-to-join-in-main-political-party-soon-as-reports-460683.html?ref=DMDesc
Be the first to comment