Wealth Looted From Agrigold Lands in Nellore : అగ్రిగోల్డ్ భూముల్లో సంపద లూటీకి గురవుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 16 వందల ఎకరాల అగ్రిగోల్డ్ భూములను 2014లో టీడీపీ ప్రభుత్వం జప్తు చేసింది. వాటిల్లోకి ఎవరూ ప్రవేశించరాదని ఆ భూముల్లోని చెట్లను నరకరాదని బోర్డులు పెట్టించింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బోర్డులను తొలగించారు. ప్రస్తుతం ఆ భూముల్లో ఉన్న చెట్లను అమ్ముకుంటూ కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నారు.