Crop Loan Waiver Third Phase Funds Releases Today : ఎన్నికల నాటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నేటితో పూర్తి చేయనుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు రెండు లక్షల రుణమాఫీని నేటితో పూర్తి చెయ్యనుంది. ఇప్పటికే రెండు విడతలుగా లక్షన్నర వరకు రైతుల అప్పులను మాఫీ చేసింది. లక్షన్నర నుంచి 2 లక్షలలోపు రుణమాఫీ ప్రక్రియను నేడు సీఎం పూర్తి చేయనున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా సీఎం ఈ ప్రకటన చేయనున్నారు. అలాగే గోదావరి జలాలను కృష్ణమ్మ ఒడిలోకి చేర్చే పూసుగూడెం పంప్హౌస్ను సైతం సీఎం ప్రారంభించనున్నారు.
Be the first to comment