Leopard Wandering in Rajahmundry People Fear : తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులో చిరుతపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఆపద ఎలా ముంచుకొస్తుందోనని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం శ్రీరాంపురంలో చిరుత పాదముద్రలు కనిపించాయనే వందతులతో స్థానికులు హడలిపోయారు. చివరకు అవి పులివి కాదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.