Minister Nara Lokesh 41 Day Praja Darbar Program : మంత్రి లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లోకేశ్ని స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఆర్ధిక సాయం, పెన్షన్ మంజూరు, ఉద్యోగ అవకాశం ఇప్పించాలంటూ వినతిపత్రాలు అందజేశారు. గత ప్రభుత్వం తనకు రైతు కూలీ పెన్షన్ నిలిపివేసిందని తిరిగి పునరుద్ధరించాలని యర్రబాలెంకు చెందిన రమాదేవి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులోని పులివాగు ఆక్రమణలతో ఏటా తమ పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోతున్నామని వాటిని తొలగించి, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.
Be the first to comment