Director vamsi paidipalli attended cinivaaram programme at hyderabad.
మున్నా,బృందావనం,ఎవడు,ఊపిరి లాంటి విబిన్నమైన కధలతో హిట్ట్ కొట్టి అగ్ర దర్శకుల్లో ఒకడిగా మినిమమ్ గ్యరేంటి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి రవీంద్ర భారతిలో నిర్వహించే సినివారం కార్యక్రమానికి ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వంశీ పైడిపల్లి నవ దర్శకులకి మరియు టెక్నిషియన్స్ కోసం తన జీవితంలో వున్న అనుభవాలను జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారు. ఒక సినిమాకి పని చెయ్యాలంటే ఒక దర్శకుడి ఇంటి చుట్టూ నెలల తరబడి తిరగాలి. జయంత్ సి పరాన్జీ దగ్గర చేరటానికి నేను కొన్ని నెలలు ఎదురు చూసాను ప్రతి ఒక్కరికి ఇలాంటి సందర్బం వస్తుంది పట్టుదలతో విడవకుండా ప్రయత్నం చెయ్యాలి టాలెంట్ వుంటే ఎవ్వడు ఆపలేడు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. సరిగ్గా ఆలోచనలని ఒక రోజుకి పెంచుకోవాలి. అంటూ తన చిన్నతనంలో హైదరాబాద్ స్కూల్ కి మరియు రవీంద్రభారతికి వున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సంఘటనలు తెలిపారు.