Micro Artist Jagadeesh Designs India Map On 3cm Silver Plate In Raajam : 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతున్నారు. 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా భారీ పతాకాలతో ర్యాలీలు నిర్వహించారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో సూక్ష్మ కళాకారుడు అతిచిన్న సైజులో భారతదేశ మ్యాప్ను చిత్రీకరించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో స్వర్ణకారుడు ముగడ జగదీష్ సూక్ష్మ కళల సృష్టికి ప్రసిద్ధి చెందారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 సెంటీమీటర్ల వెండి పెట్టిపై భారత్ మ్యాప్ను అద్భుతంగా ఆవిష్కరించాడు. 3 సెంటీమీటర్ల పొడవు, వెడల్పుతో, 2.200 గ్రాముల వెండితో తయారుచేసిన సూక్ష్మ వెండి పెట్టిపై భారత దేశం మ్యాప్ తయారు చేసి చూపరులను ఆకట్టుకుంది. దీనికి రంగులు అద్ది దానిపై సూక్ష్మ జాతీయ పతాకంను ఉంచారు. దీనిని తయారు చెయ్యడానికి మూడు గంటల సమయం పట్టిందని జగదీష్ తెలిపాడు. ఈ సృజనాత్మక దేశభక్తి, సాంకేతిక స్వర్ణకళా నైపుణ్యం, అద్భుతమైన సమ్మేళనంగా పలువురు ప్రశంసించారు. ఈ డిజైన్ సోషల్ మీడియా వేదికలలో విశేషమైన స్పందన సంపాదించుకుంది.
Comments