Huge Flood Water Flow Into Srisailam Project: శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,32,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 869 అడుగులకు చేరింది. శ్రీశైలం గరిష్ట నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 138 టీఎంసీలకు చేరింది. మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవాకు 166 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. దీంతో శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 7,497 క్యూసెక్కులుగా ఉంది. జూరాలకు కూడా రెండు లక్షల క్యూసెక్కులకు పైగానే ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ జిల్లా ప్రాజెక్టుల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. శ్రీశైలానికి మరో వారం రోజుల పాటు ఇదే ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు.
Comments