Kothapeta Rs 1Crore Gold Theft Case Solved Police: అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం అమలాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా కేసు వివరాలు వెల్లడించారు.పొన్నాడ రవిశంకర్, పైరా చిరంజీవి అనే ఇద్దరు నిందితులు 2025లో కొత్తపేటలోని ఓ ఇంట్లోకి చొరబడి బీరువా పగలగొట్టి 646.361 గ్రాముల బంగారాన్ని అపహరించారు. దీనిపై కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా గురువారం ఇద్దరినీ అదుపులోకి తీసుకొని చోరీ సొత్తును రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.నిందితులపై గతంలో కేసులు: ప్రధాన నిందితుడు పొన్నాడ రవిశంకర్పై ఇప్పటికే 120 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని, మరో నిందితుడు పైరా చిరంజీవిపై హత్య కేసు కూడా ఉందని ఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.
Comments