Skip to playerSkip to main content
  • 10 hours ago
​Prakasam Barrage Inflow : ప్రకాశం బ్యారేజీకి జల కళ వచ్చింది. కృష్ణా నది ఉప నది మున్నేరు పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవడంతో వరద నీరు నదిలోకి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీకి 5 వేల క్యూసెక్కుల పైగా వరద నీరు వస్తోంది. 2 వేల 900 క్యూసెక్కుల వరద ప్రవాహం దిగువకు సముద్రంలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా తాగు నీటి అవసరాల కోసం బందరు, రైవస్ కాల్వలకు 2 వేల 100 క్యూసెక్కులు వదులుతున్నట్లు పేర్కొన్నారు. మున్నేరు నుంచి మరో రెండు, మూడు రోజులు వరద ప్రవాహం కృష్ణా నదిలోకి వస్తుందని ప్రకాశం బ్యారేజీ హెడ్ వర్క్స్ ఇంఛార్జ్ ఈఈ రవికిరణ్ చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

Category

🗞
News
Comments

Recommended