Heavy Floods Flowing In Godavari : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఈరోజు ఉదయం ఐదు గంటలకు 54.8గా ఉన్న గోదావరి నీటిమట్టం 55.3 అడుగులకు చేరింది. శుక్రవారం రాత్రి 12 గంటలకు నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు చివరి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నీటిమట్టం పెరగటంతో స్నానగట్టాల ప్రాంతం, కల్యాణ కట్ట, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగాయి. వరద ఉద్ధృతి వల్ల పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Comments