Godavari Water Revel Receding : భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉద్ధృతి ప్రస్తుతం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరద కారణంగా నీటిమట్టం గరిష్ఠంగా 56.7 అడుగులకు చేరింది. అయితే శనివారం నుంచి గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈరోజు గోదావరి నీటిమట్టం 36 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. మరోవైపు గోదావరి దిగువన గల శబరి నది శాంతించడంతో గోదావరి శబరి నదులు ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వరద ఉద్ధృతి తగ్గి సాధారణ స్థాయికి చేరుతోంది. అయితే ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గడంతో రాత్రికి తగ్గుముఖం పట్టడంతో తొలుత మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు నీటిమట్టం 47.8 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికనూ ఉప సంహరించారు. దీంతో భద్రాచలంలో పలు మార్గాల్లో వరద నీరు తగ్గడంతో వాహనాల రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
Comments