Deputy CM Pawan Welcomes Kumki Elephants : విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకీ ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు. కుంకీలు జయంత్, అభిమన్యుకు పూల మాలలు వేశారు. చెరుకు గెడల్ని ఆహారంగా అందించారు. ఈ రెండు కుంకీలను పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తీసుకెళ్లి, అక్కడ సంచరించే అడవి ఏనుగులను దూర ప్రాంతాలకు తరలించేందుకు వినియోగిస్తారు.
Comments