A Hired Bus Lost Control And Crashed Into The Platform In Nellore RTC Bus Stand : నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్లో సోమశిల నుంచి వచ్చిన అద్దె బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి ప్లాట్ఫారంపైకి దూసుకెళ్లడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు ప్రయాణికులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఒక్కసారిగా బస్సు వేగంగా వచ్చి ప్లాట్ఫారంపైకి దూసుకురావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్న వారు ప్రాణభయంతో పరుగులు తీశారు.డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? : డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో పాటు వేగాన్ని అదుపులో ఉంచకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి ప్రమాదానికి గల అసలు కారణాలను ఆరా తీస్తున్నారు.
Comments