Skip to playerSkip to main content
  • 5 weeks ago
Mangalagiri Mahanadu 2026 Food Menu : ఆహా ఏమి రుచి తినరా మైమరచి అనేట్లుగా టీడీపీ మహానాడు అతిథ్య మెనూ ఆహ్వానం పలుకుతోంది. మహానాడు అంటేనే పసందైన విందుకు చిరునామా. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వతహాగా భోజన ప్రియుడు కావడంతో ఆయన ఇష్టపడే వంటకాలను ఇందులో పాల్గొనే అతిథులకు విందు ఇస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 25 రకాల సంప్రదాయ వంటలను అందుబాటులో ఉంచారు. ఇవన్నీ అతిథులకు నోరూరిస్తున్నాయి.  ఇందులో గుమ్మడిహల్వా, మిర్చి బజ్జీ, పప్పు- దప్పళం, ఉలవచారు, పాలతాలికలు, చక్కెర పొంగలి, పెరుగు చట్నీ లాంటి సంప్రదాయ వంటలతో పాటు, వెజ్‌ జైపూరీ, కడాయ్‌ వెజిటబుల్‌ కుర్మా వంటి పదార్థాలున్నాయి. అంతేకాక ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, సాయంత్రం స్నాక్స్‌ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ పసందైన విందును రుచి చూస్తూ ఆహా ఏమి రుచి తినరా మైమరచి అని అతిథులు అంటున్నారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.
00:38Thank you for joining us.
Comments

Recommended