Nara Lokesh Rejects Special Chair in Karnataka Tour: తనకంటే పెద్దలపై ఉన్న అపారమైన గౌరవాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్ మరోసారి చాటుకున్నారు. కర్ణాటకలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్ సింధనూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ కోసం నిర్వాహకులు వేదికపై ప్రత్యేకంగా పెద్ద కుర్చీని వేశారు. కానీ దాని పక్కనే కేంద్ర మంత్రి కుమార స్వామి సాధారణ కుర్చీలో ఆసీనులై ఉన్నారు. కానీ లోకేశ్ను ప్రత్యేక కుర్చీలో కూర్చోవాలని కేంద్ర మంత్రి కుమారస్వామి సూచించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్ ‘పెద్దవాళ్లు మీరే ఆ కుర్చీలో కూర్చోవాలి’ అని సవినయంగా కేంద్ర మంత్రి కూమారస్వామితో చెప్పారు. అయినా కుమారస్వామి మాట వినలేదు. దాంతో చివరకు లోకేశ్ సాధారణ కుర్చీని వేయించుకుని అందులో కూర్చున్నారు. దాంతో పెద్దలపట్ల గౌరవప్రదంగా వ్యవహరించిన లోకేశ్ కార్యకర్తలు, అభిమానుల మనసులను చూరగొన్నారు.
Comments