Penna Cements Chief Donates Gold Crowns To Vontimitta Temple: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులకు బంగారు కిరీటాలను పెన్నా సిమెంట్ అధినేత పి. ప్రతాపరెడ్డి కానుకగా అందజేశారు. ఒంటిమిట్ట ఆలయంలో ప్రతాపరెడ్డి దంపతులు స్వామి వారికి మూడు కిరీట బంగారు కిరీటాలను తీసుకొచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మూడు బంగారు కిరీటాలతో అర్చకులు పెన్నా ప్రతాపరెడ్డి దంపతులు ప్రదక్షిణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అలంకరించారు. మూడు బంగారు కిరీటాలు బరువు 2.241 కిలోలు కాగా వాటి విలువ రూ. 2.85 కోట్లుగా పెన్నా సిమెంట్ అధినేత ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ నెలలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగునున్న నేపధ్యంలో స్వామివారికి ఊరేగింపు సందర్భంగా బంగారు కిరీటాలను అత్యంత సుందరంగా అలంకరించనున్నారు. ఇలాంటి సమయంలో శ్రీసీతారాముల వారికి ప్రతాపరెడ్డి దంపతులు స్వామి వారికి మూడు కిరీట బంగారు కిరీటాలను బహుకరించడం విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది.
Comments