Tomato feed for sheep : జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రైతు వల్లూరి నర్సింహులు తన నాలుగు ఎకరాల పొలంలో టమాటా సాగు చేశారు. ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టారు. పంటను హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తే బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.20 చొప్పున విక్రయిస్తుంటే, రైతువద్ద మాత్రం 24 కేజీల బాక్స్ను కేవలం రూ.70లకే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కాస్త మొత్తంలో హమాలి ఛార్జీలు, రవాణా ఖర్చులు పోను చేతికి ఒక్క రూపాయి కూడా మిగలడం లేదన్నారు. వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల దాడి మరింత కుంగదీశాయని, పురుగుల మందులు పిచికారీ చేసినా తెగులు అదుపులోకి రాక దిగుబడి తగ్గిపోయిందన్నారు. లక్షల రూపాయల అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి తుడిచి పెట్టుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో పంటను కోయకుండా గొర్రెలను మేపుతున్నానని నర్సింహులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments