అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. లా వర్సిటీ, క్వాంటం వ్యాలీ, బసవతారకం ఆస్పత్రికి అదనంగా మెడికల్ కాలేజీ కోసం ఆరు ఎకరాలు కేటాయించామన్నారు. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులకు ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ చెప్పారు.