Mla Kaushik Reddy On Tgpsc Group-1 Exam : రాష్ట్రం లో గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో భారీ కుంభకోణం జరిగిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 25 సెంటర్స్లో 10 వేల మంది పరీక్షలు రాస్తే 69 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించగా, కోఠి ఉమెన్స్ కళాశాలలోని సెంటర్ 18, 19 కేంద్రాల్లో 1490 మంది రాస్తే వారిలో 74 మంది ఎలా పాసయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే పరీక్షా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలికి గ్రూప్-1 పరీక్షలో ఎస్టీ కోటాలో స్టేట్ మొదటి ర్యాంక్ రావడం పైనే తమకు అనుమానం ఉందన్నారు.