Shailaja Kiron Visits Katuri Art Gallery: ఇనుము, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను పునర్వియోగించే పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఆమె సందర్శించారు. 2 సంవత్సరాల క్రితం మరణించిన తన తండ్రి సుందరనాయుడు విగ్రహం తెనాలి కాటూరి శిల్పశాలలో తయారవుతోంది. విగ్రహం తుదిరూపును పరిశీలించి కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. విగ్రహం చాలా బాగా తయారైందని శిల్పులను అభినందించారు. ఆర్ట్ గ్యాలరీలోని విగ్రహాలను తిలకించారు.
Be the first to comment