SANKRANTHI RUSH IN VIJAYAWADA: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ నెహ్రు బస్టాండు కిక్కిరిసిపోతోంది. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండు ప్రాంగణమంతా రద్దీగా మారింది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా చాలా మంది సొంతూళ్లకు పయనమయ్యారు. దాంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న ఆర్టీసీ అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
Be the first to comment