CM Revanth Speech in Mahabubnagar Rythu Panduga : ఈ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల కోసం రూ.54 వేల కోట్లు ఖర్చు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల కోసం ఇంకా సొమ్ము అయినా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మహబూబ్నగర్లో రైతు పండుగ ముగింపు వేడుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మరోవైపు రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సహా పాలమూరు అభివృద్ధిపై ప్రసంగించారు. నవంబర్ 30వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉందన్న ఆయన, సరిగ్గా ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కోసం ఉత్సాహంగా ఓట్లు వేసి నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దింపారని అన్నారు.
Be the first to comment