AP JAC Chairman Bopparaju Venkateswarlu : గత ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెట్టిందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో 10, 15 తేదీల్లో జీతాలు అందేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. గత ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైనా మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. విజయవాడ రెవెన్యూ భవన్లో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి సెక్రటేరియట్ సమావేశం అనంతరం మీడియాతో ఆ సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ దామోదర్ మాట్లాడారు. ఉద్యోగులు అభిప్రాయాలతో కూడిన 18 అంశాలను సీఎం కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని ఆయన చెప్పారు.
Be the first to comment