CM Chandrababu on Annadata Sukhibhava Scheme : అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. కడపలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగనున్నందున ఈ నెల 18 నాటికే అన్ని కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీలు వేస్తామన్నారు. ప్రధాని చేతుల మీదుగా రాజధాని రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం విజయవంతమైన వేళ దేశం, ప్రపంచం దృష్టి అమరావతి మీదకు మళ్లిందన్నారు.