CM Chandrababu Naidu Review Meeting in Tirumala : తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని చంద్రబాబు తెలిపారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అధికారులకు సూచించారు.
Be the first to comment