CM Revanth Reddy Delhi Tour Updates : రాష్ట్రంలో వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. సుమారు రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రాథమికంగా కేంద్రానికి నివేదించారు. తెలంగాణలో వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ నెల 2న ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వివరించేందుకు ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ కోరారు. ఈ క్రమంలో అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రేవంత్రెడ్డి హుటాహుటిన బుధవారం సాయంత్రం దిల్లీ బయలుదేరి వెళ్లారు.
Be the first to comment