Distribution of Clay Ganesha Idols at AP Secretariat : వినాయక చవితి వేడుకల్లో భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని కాలుష్య నియంత్రణ మండలి పిలుపునిచ్చింది. అమరావతి సచివాలయ ఉద్యోగులకు దాదాపు 3 వేల విత్తనాలతో కూడిన మట్టి గణపతులను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ కృష్ణయ్య ఉచితంగా పంపిణీ చేశారు. రసాయన రంగులతో తయారైన విగ్రహాల నిమజ్జనం వల్ల భూగర్భ జలాలు, చెరువులు, నదులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని వివరించారు. సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే సహజ పదార్థాలతో విగ్రహాలను తయారు చేసి, ప్రతి విగ్రహంలోనూ ఒక విత్తనాన్ని ఉంచి అందిస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనం తర్వాత అదే విత్తనం మొక్కగా మారేలా విత్తన గణపతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగానే సచివాలయంలో మట్టి గణపతుల పంపిణీ చేపట్టామని కృష్ణయ్య వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చే నేతలనే వారి స్ఫూర్తితో ప్రజలు కూడా పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు.
Comments