Producer Nagavamsi In Tirumala Devastanam Darshanam : తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ దర్శించుకున్నారు. తనతో పాటు 'లెనిన్' చిత్ర దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి తిరుమలను సందర్శించారు. మంగళవారం ఉదయం వీఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆగస్టు 14వ తేదీన తమిళ హీరో సూర్య నటించిన "విశ్వనాథ్ అండ్ సన్స్" సినిమా విడుదల కానుంది. దీని సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని నాగవంశీ తెలిపారు. ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విశ్వనాథ్ అండ్ సన్స్ను ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. కోలీవుడ్ స్టార్ నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. కానీ ఇది ఏ రేంజ్కు వెళ్తుందనేది మాత్రం నిర్ణయించలేనన్నారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే ఓ మంచి చిత్రంగా నిలుస్తుందని నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.
Comments