YS Sharmila Comments Over Arcelor Mittal Steel Plant in AP: ప్రైవేటు కంపెనీ అయిన ఆర్సెలార్ మిత్తల్ కంపెనీకి కల్పించిన రాయితీలు రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్ప్లాంట్కు ఎందుకు అందించట్లేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. మిత్తల్ కంపెనీ ద్వారా వచ్చే ఉద్యోగాలను స్వాగతిస్తున్నామన్న షర్మిల ఇప్పటికే ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును ఎందుకు సంరక్షించట్లేదన్నారు. నక్కపల్లి మండలంలో మిత్తల్ స్టీల్ ప్లాంట్ స్థాపనను స్వాగతిస్తూనే, ఆ సంస్థకు ప్రభుత్వం భారీ భారీ రాయితీలు కల్పిస్తోందని విమర్శించారు. మిత్తల్ సంస్థకు రూ. 25 వేల కోట్ల రాయితీలు, 15 ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు, యూనిట్ విద్యుత్ రూపాయికే ఇచ్చి తల్లి ప్రేమ కనబరిచారని కానీ విశాఖ స్టీల్ప్లాంట్పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను వెంటనే సెయిల్లో విలీనం చేయాలని లేదా మిత్తల్కు ఇచ్చిన తరహాలోనే రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1.80 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 10 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమన్నారు. ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు.
Comments