Huge Devotees To Tirumala Tirupati Temple : తిరుమల శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాలలో తరలి రావటంతో తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరిగిపోయింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ కొంత ఆలస్యమవుతుంది. దీంతో వాహనాలు గో మందిరం వరకు బారులు తీరాయి. వాహనాలను తనిఖీ చేసి తిరుమలకు అనుమతించడానికి టీటీడీ అధికారులు చర్యలు చేపట్టి వాహన రద్దీని నియంత్రిస్తున్నారు.
Be the first to comment