Police Arrest Gang Involved in Circulating Fake Currency Notes In Srikakulam District : శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సరిహద్దు ప్రాంతంలో నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. సంత లక్ష్మీపురంలో దొంగ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ మూర్తి తెలిపారు. వీరి నుంచి 57 లక్షల 25 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు, ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.