Budameru Victims Problems : విజయవాడ ప్రజలను వరద గాయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. సర్వస్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా నిలిచినా పరిహారం విషయంలో మాత్రం ఇంకా చాలా మందికి అందలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా తిరుగుతూనే ఉన్నా ఖాతాల్లో డబ్బులు పడటం లేదంటూ వరద బాధితులు ఆవేదన చెందుతున్నారు. వరద నష్టాన్ని అంచనా వేయడంలో కొందరు అధికారులు అలసత్వం వహించినందునే సాయం అందలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.