Vijayawada Recovering to Floods : విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలు వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. సింగ్నగర్ ఇప్పటికే పూర్తిస్థాయి సాధారణ స్థితికి చేరుకోగా పాయకాపురంలోని అనేక కాలనీలు క్రమంగా కోలుకుంటున్నాయి. ఇళ్ల మధ్య నిల్వ ఉన్న నీటిని బయటకు పంపే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటురోగాలు ప్రబలకుండా కార్మికులు పారిశుద్ధ్య కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి పంపింగ్ పనులను మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేశారు.
Be the first to comment