GANDIKOTA DEVELOPMENT: గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట వారసత్వ సంపదకు మహర్దశ రానుంది. శత్రు దుర్భేద్యమైన కోటను కాపాడేందుకు పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. 78 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఇక్కడ సీప్లేన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సుముఖత చూపడం, పర్యాటకంగా గండికోట అభివృద్ధి పథంలో నడుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Be the first to comment