Ram Mohan Naidu on SeaPlane : దేశంలో సీ ప్లేన్ తొలిసారిగా ఏపీ నుంచే ప్రారంభమవుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్పోర్టులు నిర్మించలేని మారుమూల ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలతో కనెక్టివిటి పెంచడానికి సీ ప్లేన్ సేవలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కొన్ని మార్గదర్శకాలు మార్చి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేట్లు స్కీంను రూపొందిస్తున్నామని చెప్పారు. మరో 3 నుంచి 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Comments