Trial Run of First Ever Seaplane Service in Punnami Ghat Vijayawada : పర్యాటక రంగంలో మరో అద్భుతం ఆవిష్కరణకు విజయవాడ వేదిక కానుంది. ఈ నెల 9న పున్నమిఘాట్లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్ ’ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్ల్లేన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. శ్రీశైలంలోని పాతాళగంగ బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న పాత జెట్టీ వద్ద సీ ప్లేన్ దిగేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.