ArcelorMittal Steel Plant in Anakapalli : ఉమ్మడి విశాఖ జిల్లా మెడలో మరో మణిహారం చేరనుంది. దేశీయ ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్స్ జాయింట్ వెంచర్ కంపెనీ రెండు దశల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తోంది. మొదటి దశలో రూ.70,000ల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. రాష్ట్ర చరిత్రలోనే ఇది భారీ పెట్టుబడి అవుతుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.