ACB Inquiry on Venkata Reddy : కోట్ల రూపాయల టెండర్ దక్కించుకోవాలంటే ఏ సంస్థకైనా తగిన అర్హతలుండాలి. దాని టర్నోవర్ కూడా అంతకంటే ఎక్కువే ఉండాలి. కానీ మైనింగ్ ఘనుడు వెంకటరెడ్డి ఇవన్నీ తోసిరాజని కోటి వార్షిక టర్నోవర్ కూడా లేని సంస్థకు ఏకంగా రూ.160 కోట్ల విలువైన టెండర్ను అప్పగించి, పెద్ద ఎత్తున సొమ్ము కొట్టేసేందుకు వ్యూహం పన్నారు. సర్వేరాళ్ల కటింగ్, పాలిషింగ్ కోసం అధిక ధరతో చైనా యంత్రాలను కొనేందుకు ఏపీఎండీసీ పూర్వపు ఎండీ వెంకటరెడ్డి చేసిన బాగోతంపై అవినీతి నిరోధకశాఖ విచారణలో ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగు చూస్తున్నాయి.
Be the first to comment