Cyber Crime In Medak : ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీసులు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్య పరుస్తున్నప్పటికీ అక్కడక్కడ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్లో కిరాణా దుకాణ యజమాని దగ్గర భారత్ పే ఎగ్జిక్యూటివ్ అని చెప్పి అతని మొబైల్ నుంచి డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడో మోసగాడు. ఆ నిందితుడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.