2019 ఎన్నికల్లో ఏపీలో కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు కనిపిస్తాయా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన కేడర్ ఆ అభిప్రాయంతో ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీల్లాగే పవన్ కూడా ధీమాగా ఉన్నారు. బలమైన ముక్కోణపు పోటీ నేపథ్యంలో ఎవరికీ మెజార్టీ సీట్లు రాకుంటే తాము కింగ్ మేకర్ అవుతామని జనసేనాని భావిస్తున్నారని తెలుస్తోంది.
అదే జరిగితే అధికారంలో ఉన్న పార్టీని ప్రజాసమస్యలపై పవన్ ఓ ఆట ఆడుకోవడం ఖాయమని చెబుతున్నారు. 2014లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఎదుటకు పలు సమస్యలు తీసుకు వచ్చి, వాటి పరిష్కారానికి తనవంతు ప్రయత్నాలు చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో తన అండతో గట్టెక్కితే ప్రజా సమస్యలపై వారిని నిత్యం సభలో, బయట నిలదీసే అవకాశముంటుందని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన కింగ్ మేకర్ కావొచ్చునని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య రసవత్తర పోరుకు అవకాశముంది. పవన్ ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. కర్ణాటకలో మనం చూసిన ఫలితాల కంటే మరింత రసవత్తరంగా ఏపీ ఎన్నికల ఫలితాలు ఉంటాయని జనసేనాని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాము మంచి సీట్లు సాధిస్తామని, అయితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది, అలాగే ఎంత రసవత్తరంగా ఉంటుందనేది ప్రజల తీర్పు చెబుతుందని పవన్ అన్నారు. 2014లో టీడీపీకి మద్దతివ్వడానికి కారణం ఉందని చెప్పారు. 14 నుంచి 16 శాతం ఓటు షేర్ వారికి పడిపోతుందని అభిప్రాయపడ్డారు.
Confident of playing a crucial role Andhra Pradesh’s next government formation, JanaSena Chief Pawan Kalyan believes his party will emerge as a kingmaker in the battle between TDP and YSRCP in the state.
అదే జరిగితే అధికారంలో ఉన్న పార్టీని ప్రజాసమస్యలపై పవన్ ఓ ఆట ఆడుకోవడం ఖాయమని చెబుతున్నారు. 2014లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఎదుటకు పలు సమస్యలు తీసుకు వచ్చి, వాటి పరిష్కారానికి తనవంతు ప్రయత్నాలు చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో తన అండతో గట్టెక్కితే ప్రజా సమస్యలపై వారిని నిత్యం సభలో, బయట నిలదీసే అవకాశముంటుందని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన కింగ్ మేకర్ కావొచ్చునని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య రసవత్తర పోరుకు అవకాశముంది. పవన్ ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. కర్ణాటకలో మనం చూసిన ఫలితాల కంటే మరింత రసవత్తరంగా ఏపీ ఎన్నికల ఫలితాలు ఉంటాయని జనసేనాని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాము మంచి సీట్లు సాధిస్తామని, అయితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది, అలాగే ఎంత రసవత్తరంగా ఉంటుందనేది ప్రజల తీర్పు చెబుతుందని పవన్ అన్నారు. 2014లో టీడీపీకి మద్దతివ్వడానికి కారణం ఉందని చెప్పారు. 14 నుంచి 16 శాతం ఓటు షేర్ వారికి పడిపోతుందని అభిప్రాయపడ్డారు.
Confident of playing a crucial role Andhra Pradesh’s next government formation, JanaSena Chief Pawan Kalyan believes his party will emerge as a kingmaker in the battle between TDP and YSRCP in the state.
Category
🗞
News