Ganesh On a Common Pin : వినాయక చవితి అంటే భారీ విగ్రహాలు, పెద్ద మండపాలు, కళ్లు చెదిరే సెట్టింగ్స్, డీజేల సందడి గుర్తుకొస్తుంది. వినాయక చవితి సందర్భంగా గణపయ్యపై భక్తి తమ చాటుకునేందుకు భక్తులు పలురకాలుగా ప్రయత్నిస్తుంటారు. అలా జగిత్యాల సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరోసారి తన ప్రతిభను చాటారు. భూమి కాలుష్యం, నీటి కాలుష్యం లేకుండా విన్నూతంగా ఆలోచించి గుండుపిన్నుపై గణపయ్యను తయారు చేసి ఔరా అనిపించుకున్నారు. ఈ విగ్రహం తయారీకి గుండు పిన్ను, మట్టి, వాటర్ కలర్స్ వాడానని, 10 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని నీరు, భూమి కాలుష్యం కాకుండా కాపాడుకునే బాధ్యత మన అందరిదని తెలిపారు. అందరూ మట్టి గణపతిని పూజించాలని దయాకర్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని ఆభిప్రాయపడ్డారు. సూక్ష్మ ఆకారంలో ఉన్న బొజ్జ గణపయ్య ప్రతిమ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments