KTR Birthday Celebrations at Erravalli Farmhouse : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు తన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ దంపతులు, కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు రావు, కుమార్తె రియాన్షి పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ తనయుడైన కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ దంపతులు దీవించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో తండ్రి కేసీఆర్తో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్కను నాటి కేటీఆర్ సంఘీభావం తెలిపారు. ఉదయం నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా జెన్-జీ యువత చేస్తున్న పోరాటానికి కేటీఆర్ మద్దతునిస్తూ ధర్నాచౌక్లో పాల్గొన్నారు. బీజేపీ పార్టీ వ్యవరిస్తున్న తీరుపై మండిపడ్డారు.
Comments