Kadapa SP Nachiketh Over Keerthana Murder Case Accused: కడప జిల్లా ఖాజీపేటలో నిన్న (శుక్రవారం) కీర్తన అనే యువతిని దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడ్ని కఠినంగా శిక్షించేందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని కడప జిల్లా ఎస్పీ నచకేత్ విశ్వనాథ్ తెలిపారు. తనను ప్రేమించలేదని కారణంతో అమ్మాయిని గొంతు కోసి నిందితుడు వెంకటేష్ హత్య చేశాడని ఎస్పీ పేర్కొన్నారు. మృతురాలి బంధువులు బాధితులు ఆందోళన చేయడంతో నిందితుని వేరే ప్రాంతానికి తరలించే క్రమంలో నిందితుడు పోలీసులపై ఎదురు దాడి చేశాడని తెలిపారు. ఆత్మ రక్షణ కోసం పోలీసులు వెంకటేష్పై కాల్పులు జరపాల్చి వచ్చిందని ఎస్పీ వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత పోలీసులను ఎస్పీ పరామర్శించారు. కీర్తనను క్రూరంగా చంపిన నిందితుడ్ని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. కీర్తన కుటుంబ సభ్యుల బాధను తాము అర్థం చేసుకుంటామంటున్నారు. కానీ చట్టప్రకారమే తాము ముందుకెళ్లాల్సి ఉంటుందని వివరించారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు.
Comments