ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ రహదారిపై ఈ తెల్లవారుజామున వరుసగా జరిగిన మూడు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. తొలుత ఓ లారీని కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న ఓ వ్యాను ఢీకొని బోల్తాపడింది. మరో వ్యాన్ బోల్తాపడిన గుడ్ల వ్యాన్ను వెనుక నుంచి ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. గుడ్లతో వెళ్తున్న వ్యాను... తెలంగాణలోని భువనగిరి నుంచి నెల్లూరు జిల్లాకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా గుడిపాటిపాడుకు చెందిన రమణయ్య, బాబు, నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందారు.